తెలంగాణలోని కులవృత్తులు చేసుకునే బీసీలకు రూ.లక్ష సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ సాయం అందనుంది. ఇందులో రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, కమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ పథకం కోసం కొందరి సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. తాజాగా కేబినెట్ సబ్ కమిటీ పథకం అమలుపై సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్ చెప్పారు.
బీసీలకు రూ.లక్ష సాయం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్న మంత్రి..ప్రతీ నెల 5వ తేదీ లోపు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఆ తరువాత ప్రతీ నెల 15న స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ.లక్ష సాయం అందించనున్నారు. సాయం అందిన వారు నెలరోజుల్లో పనిముట్లు కొనుక్కోవాలని మంత్రి కోరారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే లక్ష సాయం నిరంతర ప్రక్రియ అని తెలపడంతో అర్హులందరు సాయం అందుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.









