ప్రతీ రోజూ రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి తప్పు, స్వీయ నిర్లక్ష్యం కారణం ఏదైనా.. రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నవే ఎక్కువ. తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం షాకింగ్కి గురి చేస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బైక్ నడుపుతోన్న వ్యక్తి నిర్లక్ష్యానికి ఇద్దురు చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బైక్పై తన భార్యతోపాటు ఇద్దరు చిన్నారులతో వెళ్తున్నాడు. ఇదే సమయంలో చౌరస్తా వద్ద రోడ్డును దాటే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అటుగా ఓ బస్సు వేగంగా దూసుకొస్తుంది. ఈ విషయాన్ని గమనించని బైకర్ ఏమాత్రం స్లో చేయకుండా ముందుకు దూసుకొచ్చాడు. దీంతో ఈ విషయాన్ని గమనించని బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బైక్ను ఢీకొట్టాడు. దీంతో బైక్పై ఉన్న చిన్నారులు దుర్మాణం చెందగా, భార్యభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సిసీటీవీలో రికార్డ్ అయ్యింది.









