టాలీవుడ్ లో విషాదం..
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం క్రితం శరత్ బాబు ఆరోగ్యం బాగోకపోవడంతో.. ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీలో హాస్పిటల్ లో చేర్పించారు . దాదాపు నెల రోజులుగా ఆయన ఐజీలో హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక శరత్ బాబు మృతితో టాలీవుడ్ లో విషాదా ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.









