ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) 50 మిగ్ 21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తం 50 మిగ్ యుద్ధ విమానాలను పక్కకు పెట్టింది. ఈనెల 8న రాజస్థాన్ లోని హనుమాన్గఢ్లో ఓ మిగ్ విమానం కూలిపోయి ముగ్గురు చనిపోయారు. దీంతో ఆ యుద్ధ విమానాల పనితీరుపై మరోసారి సందేహాలు రేకెత్తాయి. ఈ నేప థ్యంలో అన్ని మిగ్ యుద్ధ విమానాలను ఐఏఎఫ్ టెక్నికల్ తనిఖీల కోసం పంపింద ని అధికారిక వర్గాలు తెలిపాయి.
‘ప్రస్తు తం ఆ విమానాలన్నింటికీ టెక్నికల్ పరీక్ష లు నిర్వహిస్తున్నారు. విధుల నిర్వహణకు ఫిట్ అని తేలిన తర్వాత సంబంధిత నిపు ణుల టీం క్లియరెన్స్ ఇచ్చాకే వాటిని అను మతిస్తం’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, 1960లో మిగ్ యుద్ధ విమానాలను ఐఏఎఫ్లో ఇండక్ట్ చేశారు. మొదటిసారిగా మిగ్ ఫైటర్ను చేర్చాక ఐఏఎఫ్ 870 మిగ్ 21 ఫైటర్లను తయారు చేసింది. అయితే, ఈ విమానాల పనితీరు నాసిర కంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.









