క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఈడీ విచారణకు హాజరయ్యాడు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యాడు. థాయిలాండ్ క్యాసినో ఘటనపై ఈడీ అధికారులు ఇటీవల చికోటి ప్రవీణ్కు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఇవాళ చికోటి ప్రవీణ్ విచారణకు వచ్చాడు.
క్యాసినో నిర్వహిస్తుండటంతో చికోటి ప్రవీణ్ను థాయిలాండ్లో ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదు లావాదేవీలకు సంబంధించి చికోటి ప్రవీణ్ను ఈడీ ప్రశ్నించనుంది. చికోటి ప్రవీణ్తో పాటు చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్లకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో వారు కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. గతంలో క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్కు సంబంధించి చికోటి ప్రవీణ్ను ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు మరోసారి ప్రశ్నించడం కీలకంగా మారింది.
ఇటీవల థాయ్లాండ్లోని ఓ స్టార్ హోటల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో విచారణ జరిగిన అనంతరం చికోటి ప్రవీణ్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారం క్రితం చికోటి థాయ్లాండ్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు. అయితే నాలుగు రోజులు ఫోకర్ టోర్నమెంట్ ఉంటుందని, ఆ టోర్నమెంట్ లీగల్ అని చెప్పడంతో తాను థాయ్లాండ్ వెళ్లినట్లు చికోటి చెబుతున్నాడు.









