పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో స్వల్ప వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ మేరకు గురువారం రాత్రి వెదర్ బులిటెన్ విడుదల చేసింది.
నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు.
ఇక రేపటి నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, ఒకటి రెండు ప్రదేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని వాతావరణశాఖ చెబుతోంది. గత కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. సాయంత్రం, రాత్రి వేళల్లో వాన పడుతుంది. ఈ నెల చివరి వరకు సాధారణ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. గురువారం ఆదిలాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రత 41.3 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత హయత్నగర్లో 23 డిగ్రీలు నమోదైంది.









