AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రాణం తీసిన అతివేగం

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. భూత్పూర్ మున్సిపాలిటీకి చెందిన బజారు ఆనంద్, అతని సోదరి నాగమణి, లక్ష్మమ్మ కలిసి బైక్ పై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ ఆసుపత్రికి వెళ్లారు. పనులు ముగించుకొని మధ్యాహ్నానికి తిరుగు పయనం అయ్యారు. ఈ క్రమంలో.. హై స్కూల్ మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ANN TOP 10