AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి

రంగారెడ్డి జిల్లాలో మసాజ్ పేరుతో యథేచ్ఛగా వ్యభిచారం సాగిస్తున్న మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అధికారులకు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

షాద్‌నగర్ పట్టణంలో అనుమతులు లేకుండా నడుపుతున్న మసాజ్ సెంటర్‌ను సీజ్‌ చేశారు. ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మసాజ్ సెంటర్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఇక దీని వెనుక ఎవరెవరు ఉనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ANN TOP 10