మూలపేట పోర్టు శంకుస్థాపన ద్వారా.. శ్రీకాకుళం ప్రజల్ని సీఎం జగన్ మరోసారి మోసం చేశారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. గతంలో జిల్లాకు సీఎం ఇచ్చిన హామీలే ఇప్పటికీ నెరవేరలేదని.. ఎన్నికల వేళ ఓట్లు దండుకోవడానికే పోర్టు శంకుస్థాపన నాటకం ఆడుతున్నారన్నారు. మూడు రాజధానులు ముగిసిన అంశం అయినా.. విశాఖను పూర్తిగా కబ్జా చేయడానికి సెప్టెంబర్ నుంచి కాపురం అంటున్నారని మండిపడ్డారు.









