బీఆర్ఎస్ను (భారత రాష్ట్ర సమితి) మూడోసారి అధికారంలోకి రాకుండా ఉండేందుకు.. కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాకుండా నిలువరించే పార్టీలోనే చేరుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెలాఖరు లోపు తన రాజకీయ పయనంపై స్పష్టత వస్తుందని వెల్లడిరచారు. ఈ నెలాఖరులో ఖమ్మంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంతో బీఆర్ఎస్పై యుద్ధం ప్రకటిస్తానన్నారు.









