గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ వెలువడింది. సినిమా ట్రైలర్ను మే 16న భోపాల్లో అత్యంత వైభవంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్తో పాటు దర్శకుడు బుచ్చి బాబు, నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, సుకుమార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ లేటెస్ట్ కబురు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ‘పెద్ది’ రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్, రెజ్లర్ (పహిల్వాన్) రెండు విభిన్న క్రీడలకు సంబంధించిన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట, టీజర్లో చరణ్ క్రికెటర్గా కనిపించగా, పుట్టినరోజున విడుదల చేసిన ‘పెద్ది పహల్వాన్’ క్లిప్లో ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, కుస్తీ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతి హాసన్తో రామ్ చరణ్కు ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. ‘పెద్ది’ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. జూన్ 3న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.








