AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహేష్ ఫ్యాన్స్ కి జక్కన ఊహించని గుడ్ న్యూస్..

జక్కన్న చేతిలో పడితే ఐదేళ్లు లాక్ అయిపోయినట్టే” ఇది ఇండస్ట్రీలో ఉన్న నానుడి .ఇక కల్కి సినిమాలో మా డార్లింగ్ జక్కన్న పై ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేశాడు కూడా. కానీ అదంతా గతం అంటూ తాజాగా తెరకెక్కుతున్న వారణాసిని చకచకా చుట్టుకుపోతున్నాడు జక్కన్న.

 

మహేష్ ఫ్యాన్స్ కి ఊహించని గుడ్ న్యూస్

అవును అందరి అంచలనాలని తలకిందులు చేస్తూ అనుకున్న సమయాన్ని కంటే సినిమాని ముగించే ప్లాన్ వేశాడట జక్కన్న. ఇదే విషయమై ఫాన్స్ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు .ప్రొడ్యూసర్స్ పక్కనే ఉన్నారంటే సరదాగా కామెంట్ చేస్తూనే మిగిలిన షూట్ ని వచ్చి 80 రోజుల్లోనే కంప్లీట్ చేస్తామంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. అంటే ఈ లెక్కన సినిమా సెప్టెంబర్ నాటికి గుమ్మడి కాయ కొట్టనున్నారన్న మాట . ఒక రకంగా చెప్పాలంటే ఇది మహేష్ ఫ్యాన్స్ కి ఊహించని గుడ్ న్యూస్ అని చెప్పాలి.

 

గ్రాఫిక్స్ అనుకున్న సమయానికి కాకపోవడమే

ఇక ఇంత స్పీడ్ గా కంప్లీట్ చేయడం వెనుక రాజమౌళి మాస్టర్ ప్లాన్ క్లియర్ గా కనిపిస్తుంది. మామూలుగా గ్రాఫిక్స్ బేస్డ్ ఫిలిమ్స్ కి, ఇలాంటి హై బడ్జెట్ ఫిలిమ్స్ కి పోస్టు ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. గతంలో ఈగ, బాహుబలి సినిమాల రిలీజ్ ఆలస్యం అవ్వడం వెనక గ్రాఫిక్స్ అనుకున్న సమయానికి కాకపోవడమే. అందుకే ఈసారి ఇలాంటి రిస్క్ తీసుకోకుండా షూట్ ని ఇలా ముందే కంప్లీట్ చేసి మిగతా టైం ని విజువల్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కేటాయించనున్నాడన్నమాట .

 

బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో

అంటే ఈ లెక్కన ముందుగా అనౌన్స్ చేసినట్టు 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ వైట్ గా రిలీజ్ కావడం పక్కా.ఇక క్యాస్టింగ్ చూస్తే మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మందాకిని పాత్రలో కనిపించనుంది. ఇక పవర్ఫుల్ విలన్ పాత్రలో కుంభ పాత్రలో మాలీవుడ్ స్టార్ పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి దుర్గా ఆర్ట్స్ మరియు షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై రానున్న ఈ సినిమా 2027 సమ్మర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో!

ANN TOP 10