(అమ్మన్యూస్, మెదక్)
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు హస్తం గూటికి చేరారు. నీలం మధు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమల పట్ల ఆకర్షితులై పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరినట్లు నీలం మధు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి, తొగుట ఎంపీపీ గంధారి లత నరేందర్రెడ్డి, లింగపూర్ మస్కూరి నర్సింహులు, ఓలపు కరుణాకర్, కొత్తపల్లి బాను, కొంగరి కరుణాకర్, కొంగరి ప్రదీప్, కొంగారి సంజీవ్, దాసని అశోక్, కొత్తపల్లి రాజు, దాసని మహిపాల్, కొంగరి రామస్వామి, గంగి స్వామి తదితరులు ఉన్నారు.









