AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నెంబర్ వన్.. మోదీ

భారత్ డిజిటల్ చెల్లింపుల్లో నంబర్ వన్ గా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వేంట్స్ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొబైల్ డేటా అతి చౌకగా లభించే దేశాల్లో భారత్ ఒకటని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది సివిల్ సర్వీస్ డే చాలా ముఖ్యమైనదని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో బృహత్తరమైన లక్ష్యాలను సాధించేందుకు దేశం వేగంగా అడుగులు వేస్తున్న తరుణమిదేనన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారిని ఉద్దేశిస్తూ.. మీరు ఈ కాలంలో పనిచేస్తుండటం మీ అదృష్టం అని, దేశానికి సేవ చేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.

ANN TOP 10