జగన్ రాయలసీమ వాసి అయినా ఈ ప్రాంతంపై ఆయనకు ప్రేమ లేదని టీడీపీ నేత లోకేష్ విమర్శించారు. ఓట్లపై తప్ప ప్రజలపై ఆయనకు ధ్యాస లేదని యువగళం పాదయాత్రలో అన్నారు. రాయలసీమ ప్రాంతానికి గుక్కెడు నీళ్లు ఇచ్చేందుకు చేతులు కూడా రావడం లేదని దుయ్యబట్టారు. అప్పర్ భద్ర డ్యామ్ను కర్ణాటక నిర్మిస్తే రాయలసీమ ఎడారి అవుతుందన్నారు.









