AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యూకేలో హైదరాబాద్ యువతి మృతి..

బిడ్డ చివరి చూపు కోసం తల్లడిల్లుతున్న పేరెంట్స్!
హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని యూకేలో మృతి చెందింది. నగరానికి చెందిన కొమ్మారెడ్డి శశిధర్‌రెడ్డి, జ్యోతి దంపతులు సైదాబాద్‌ పూర్ణోదయ కాలనీలో నివాసముంటున్నారు. వీరి ఒక్కాగానొక్క కూతురు సాయి తేజస్వి కొమ్మారెడ్డి (24) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం యూకే వెళ్లింది. అక్కడి బెడ్‌ఫోర్డ్‌లోని క్రాన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీలో ఆస్ట్రోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతోంది.

అయితే ఈ నెల 11న సరదాగా బ్రైటన్‌ మెరీనా బీచ్‌కు వెళ్లిన ఆమె.. సముద్రపు అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతి విషయాన్ని అక్కడి పోలీసులు.. కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం తేజస్వి మృతదేహాన్ని అక్కడి అధికారులు యూకేలోని ఓ ఆస్పత్రిలో ఉంచారు. అయితే.. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. తేజస్వీ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావటం ఖర్చుతో కూడుకున్న పని తమను ఆదుకోవాలి మృతురాలి కజిన్ ప్రియా రెడ్డి ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ను కోరారు.

వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. తేజస్వి మృతదేహాన్ని ఇండియాకు తీసుకుచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. తమ బృందం స్థానిక బ్రిటీష్ హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతారని వారికి ధైర్యం చెప్పారు. ఇక తేజస్వి మృతితో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఒక్కాగానొక్క అమ్మాయి ఇలా అకాల మరణం చెందటంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుపోతున్నారు. తమ కూతురు కడసారి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక బీజేపీ నేతలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన బ్రిటీష్ రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారు. మృతదేహాన్ని రెండు రోజుల్లో తీసుకువచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

ANN TOP 10