న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియాకు కోవిడ్19 వైరస్ పాజిటివ్ అని తేలింది. పౌర విమానయాన శాఖ మంత్రి అయిన ఆయన ఈ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆయన తన ట్వీట్లో తనకు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. తనతో గత కొన్ని రోజుల్లో కాంటాక్ట్లోకి వచ్చిన వారంతా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.









