AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ ‘జిలేబీలు’ వేసి ఆకట్టుకున్నారు

న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సాన్ ఆక్లాండ్‌లో జరిగిన సిక్కు కమ్యూనిటీ క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంప్రదాయ భారతీయ జిలేబీలను తయారు చేసి, అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. ఆయన జిలేబీలు వేస్తున్న మరియు స్వయంగా పంపిణీ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ప్రధాని క్రిస్టోఫర్ స్థానిక ఎంపీ రిమా నఖ్లేతో కలిసి టకానినిలో జరిగిన ఈ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన అథ్లెట్లను కలిసి, క్రీడాకారులు, సహాయకులతో ముచ్చటించిన తర్వాత, అక్కడ జిలేబీలు తయారు చేస్తున్న వారి వద్దకు వెళ్లి సరదాగా జిలేబీలు వేశారు. ఆ తర్వాత అక్కడున్న వారికి స్వయంగా జిలేబీలను అందించారు.

క్రిస్టోఫర్ ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. “స్థానిక ఎంపీ రీమా నఖ్లేతో కలిసి సిక్కు క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. క్రీడల్లో పాల్గొంటున్న వారికి, అలాగే నా చేతి జిలేబీ తిన్న వారికి శుభాకాంక్షలు” అని ఆయన రాసుకొచ్చారు.

ANN TOP 10