AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజకీయాల్లో హుందాతనం పాటించాలి: వివాదాస్పద పోస్టుపై టీడీపీ అభిమానికి నారా లోకేశ్ హితవు

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు మరియు మద్దతుదారులకు గట్టిగా పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్‌ను కించపరిచేలా ఒక టీడీపీ అభిమాని పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియోపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో హుందాతనం మరియు గౌరవాన్ని పాటించాల్సిన అవసరాన్ని లోకేశ్ నొక్కి చెప్పారు.

ఎక్స్ వేదికగా వైరల్ అయిన ఆ వీడియోలో, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నడుచుకుంటూ వెళుతుండగా, వైఎస్ జగన్ రోడ్డు పక్కన కూర్చుని “నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి” అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శిస్తున్నట్లు చూపించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో, లోకేశ్ వెంటనే స్పందించి, ఇలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకున్నప్పటికీ, వ్యక్తిగత దాడులు ఎప్పటికీ మంచివి కాదని పేర్కొన్నారు.

“మా మద్దతుదారులతో సహా ప్రతి ఒక్కరూ ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని నేను అభ్యర్థిస్తున్నాను” అని లోకేశ్ స్పష్టమైన సూచన చేశారు. రాజకీయ ప్రత్యర్థులం అయినప్పటికీ, తమ చర్యలు గౌరవప్రదంగా ఉండాలని, విభేదాలు ఉన్నప్పటికీ హుందాతనాన్ని పాటిద్దామని ఆయన కోరారు. అనవసరమైన ట్రోలింగ్‌కు స్వస్తి పలికి, ఆంధ్రప్రదేశ్‌ను బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి సారిద్దామని ఆయన పరోక్షంగా సూచించారు.

ANN TOP 10