ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉట్నూర్లోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురికాగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు.
దీంతో హుటాహుటీన కుటుంబసభ్యులను ఆయనను హైదరాబాద్కు తరలించారు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









