పట్టణంలోని హ్యాండిక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసారు.దివ్యాంగుల చట్టం 1995 ,2016 సెక్షన్ 92 పై అవగాహన పత్రం పోస్టర్ ను ఫౌండర్ ప్రెసిడెంట్ మహ్మద్ ఇమ్రాన్ , సెక్రటరీ ఫైజల్ అహ్మద్ తో కలిసి కంది శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. చట్టం ప్రకారం దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా రంగినేని శాంతన్ రావ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండి దేవిదాస్ చారి,శ్రీలేఖ ఆదివాసీ,పోరెడ్డి కిషన్,నాగన్న,మునిగేల విట్టల్,కయ్యుమ్,మొహమ్మద్ రఫీక్,సమీ ఉల్లా ఖాన్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.









