భూపాలపల్లిలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. జాతీయ పార్టీగా ఓ వెలుగు వెలగాలనుకుంటే తెలంగాణలోనే ఓటమి పాలై ఆ ఆశలన్నీ అడుగంటాయి. ఇంట గెలవలేకపోవడంతో రచ్చ గెలుపుపై దాదాపు ఆశలు వదిలేసుకుంది.ఇక ప్రస్తుతం తెలంగాణలో సొంత పార్టీ నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారయణ రావు సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.









