AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..

జిహెచ్ఎంసి నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియపైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు ప్రగతి భవన్ లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను జిహెచ్ఎంసి మరింత వేగవంతం చేసింది. జిహెచ్ఎంసి పరిధిలోని నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి , డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లు హాజరైన ఈ సమావేశానికి జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే 70వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు ఈ సమీక్ష సమావేశంలో మంత్రులకు తెలియజేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని, ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. ఇందులో సుమారు 4500 కు పైగా ఇండ్లను ఇన్ సిట్యూ లబ్ధిదారులకు అందించామని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందదన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని జిహెచ్ఎంసి అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రక్రియ పంపిణీ పైన మంత్రులు పలు సూచనలను తెలియజేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10