అనసూయ …ఒకప్పుడు తనదైన యాంకరింగ్ తో ఆడియన్స్ ని అలరించిన ఈ హాటీ బ్యూటీ ఇప్పుడు వరుస కాంట్రవర్సీలకి కేరాఫ్ అవుతుంది.ఆ మధ్య శివాజీ చీరకట్టు విషయంలో దూరి మరీ వైరల్ అయింది ఈ భామ .ఇక తాజాగా హిందూ ధర్మాన్ని,సనాతన ధర్మాన్ని అవమానించింది అంటూ అనసూయపై ఏకంగా కొంతమంది పోలీస్ స్టేషన్ లలో కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా అనసూయ తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. పర్సనల్ గా ఎవరినీ టార్గెట్ చేయకుండా కేవలం సాలిడ్ స్ట్రాంగ్ వర్డ్స్ తో జనరల్ స్టేట్మెంట్ లో తన మనసులోని భావాన్ని ఇలా బయటపెట్టేసింది.
“Wrapped in grace.. rooted in Truth.. soft in spirit.. steady in strength..”అంటూ ఇన్ డైరక్ట్ పోస్ట్ వదిలి తాను ఏమనుకుంటుందో క్లియర్ గా చెప్పేసింది,మన గురించి తెలీని వాళ్ళు ఎన్నో అనుకుంటూ ఉంటారని,వాటి కారణంగా లైఫ్ లో ఎంతో గందరగోళం ఏర్పడుతుందని అయితే మనలోని నిజాయితీ,మన మీద మనకున్న నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అంటూ తనపై ట్రోల్ చేసేవారికి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వదిలింది ఈ రంగమ్మత్త.
ఇక ఇదే పోస్ట్ లో “The World will keep making its noise.. but here I am.. keeping my grace and standing tall”అనే కామెంట్స్ వదిలి ట్రోలర్స్ కి గట్టి షాక్ ఇచ్చింది.ఏదైనా మాట్లాడితే కామెంట్లు, కొత్తగా చెబితే ట్రోల్స్ , సరదాగా ఫోటో పెడితే పిచ్చి పిచ్చి గా మాట్లాడటం వంటివి ఎంతో మంది చేస్తుంటారని, ఇక ‘అలా మాట్లాడిన వారందరికీ ఆన్సర్ ఇచ్చుకుంటూ పొతే అంతే సంగతులు’ అనే మెసేజ్ ని నర్మగర్భంగా చెప్పేసింది అనసూయ.
ముఖ్యంగా అనసూయ పెట్టిన పోస్ట్ లో “Still me.. Still Standing.. Unshaken” అనే చివరి లైన్ అనసూయ మెంటాలిటీ ఏంటో క్లియర్ గా చెప్పేసింది.తనని ఎవరెన్ని మాటలు అన్నా,ఏం చేసినా తానూ ఏ మాత్రం షేక్ అవ్వకుండా అలాగే ధైర్యంగా నిలబడతాను అని చెప్పడం ఆ పోస్ట్ యొక్క అర్థం.అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టాను అన్నది చెప్పకపోయినా గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ట్రోల్స్ కి కౌంటర్ గానే ఈ పోస్ట్ అంటూ విశ్లేషిస్తున్నారంతా.మొత్తంగా ఎవరెన్ని మాట్లాడినా మాటల్లోనే కాదు చేతల్లోన్నే తనపై వచ్చిన ట్రోల్స్ కి ఆన్సర్ ఇస్తాను అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ వెటరన్ బ్యూటీ.
చూడాలి మరి అనసూయ ఇన్ డైరెక్ట్ గా చేసిన ఈ కామెంట్స్ కి నెటిజన్లు ఎలాంటి రియాక్షన్స్ వదులుతారో !








