AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దుర్గం చెరువులో దూకిన ఇంటర్ స్టూడెంట్

రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు
హైదరాబాద్ దుర్గం చెరువులో దూకి ఓ ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్యకు యత్నించింది. సకాలంలో స్పందించిన పోలీసులు బాలికను రెస్క్యూ చేశారు. చెరువులో దూకిన వెంటనే కాపాడి ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీలో ఉంటున్న ఓ బాలిక ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ మధ్య ఫోన్ ఎక్కవగా వాడుతున్నట్లు తల్లి గమనించి మందలించింది. మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి.. ఆమె ఇంటి నుంచి బయల్దేరింది.

ఆ తర్వాత కాసేపటికే ఆమె కాలేజీకి రాలేదని యాజమాన్యం తల్లి ఫోన్ చేసి చెప్పింది. దీంతో కంగారు పడిన తల్లి తెలిసిన వారి ఇళ్లకు ఫోన్ చేసి అడిగింది. వారు తమ వద్దకు రాలేదని చెప్పటంతో ఆందోళనకు గురై.. కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సకాలంలో స్పందించిన పోలీసులు.. బాలిక సెల్‌ఫోన్‌ను ట్రాక్‌ చేశారు. ఆమె మధ్యాహ్నం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ఉందని సిగ్నళ్ల ద్వారా గుర్తించారు. వెంటనే మాదాపూర్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. వారు లేక్‌ పోలీసులు, ఐటీ మొబైల్‌ సిబ్బందిని అలెర్ట్ చేసి చెరువు వద్దకు పంపించారు.

ఆ సమయంలో బాలిక కేబుల్‌ బ్రిడ్జి నుంచి చెరువులోకి దూకింది. పోలీసులు, బోటింగ్‌ సిబ్బంది సహాయంతో బాలికను సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించి విద్యార్థిని కాపాడిన లేక్ పోలీసులను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అభినందించారు.

ANN TOP 10