AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టమాటా రైతుకు కనకవర్షం.. అభినందించిన సీఎం

టమాటా పండించి కోటీశ్వరుడైన కౌడిపల్లి రైతు మహిపాల్‌ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌ రెడ్డితో వచ్చి సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రిని మహిపాల్‌ రెడ్డి దంపతులు కలిశారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాటా పంటను విక్రయించామని, మరో కోటి రూపాయల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని సీఎంకు వివరించారు. వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని మహిపాల్‌ రెడ్డికి కేసీఆర్‌ సూచించారు.

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి అనే రైతు టమాట పండించి కోటీశ్వరుడయ్యారు. తనకున్న పొలంతోపాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని మహిపాల్‌రెడ్డి కూరగాయలు సాగు చేస్తుంటారు. ఈసారి ఎనిమిది ఎకరాల్లో టమాటా పంట వేశారు. అయితే, పంట చేతికొచ్చే సమయానికి టమాటాకు మునుపెన్నడూ లేని ధర పలుకుతుండటంతో మహిపాల్‌ రెడ్డిని లక్ష్మీదేవి కరుణించింది. ఇప్పటిదాకా ఎనిమిది వేల బాక్సుల(ఒక్కో బాక్సు 25 కిలోలు) టమాటాలు విక్రయించగా మహిపాల్‌రెడ్డికి రూ.కోటీ 84 లక్షలు వచ్చాయి. ఇంకా రూ.కోటి విలువ చేసే టమాట ఆయన వద్ద ఉంది. అయితే, వచ్చిన ఆదాయంలో రూ.50లక్షల వరకు పెట్టుబడి ఖర్చులకు వెళ్తుందని మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 5న హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు మహిపాల్‌రెడ్డి 550 టమాటా బాక్సులు తీసుకెళ్లగా ఒక్కో బాక్సు రూ.2,300 నుంచి రూ.2,500 చొప్పున పలికింది. దీంతో ఒక్కరోజే మహిపాల్‌రెడ్డికి రూ.13.75లక్షలు వచ్చాయి.

ANN TOP 10