ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులను మార్చేస్తూ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు అధిష్టానం ఉద్వాసన పలికారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోము వీర్రాజుకు ఫోన్ చేసి అధ్యక్ష పదవి మార్పు గురించి తెలిపారు.









