బెంగళూరు : కర్ణాటక ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంది. శాసన సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి, కాంగ్రెస్కు పట్టం కట్టారు. ‘కింగ్మేకర్’గా ప్రసిద్ధి పొందిన జేడీఎస్కు చుక్కలు చూపించారు. అది ఎంత తీవ్రంగా ఉందంటే జేడీఎస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి గెలిచినప్పటికీ, ఆయన కుమారుడు నిఖిల్ కుమార స్వామి పరాజయంపాలయ్యారు. నిఖిల్ తల్లి అనిత కుమార స్వామి చేసిన త్యాగం వృథా అయింది.









