AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆత్మకూరులో శాకాంబరి మహోత్సవం.. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ సరస్వతి అమ్మవారు

తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌లోని ఏకైక సరస్వతి క్షేత్రంగా పేరొందిన శ్రీ కొలనుభారతి ఆలయంలో శాకాంబరి మహోత్సవ క్రతువులను ఘనంగా నిర్వహించారు. దేశంలోని రెండవ సరస్వతి క్షేత్రంగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా శాకాంబరి మహోత్సవాన్ని నిర్వహించి, శ్రీ సరస్వతి అమ్మవారిని శాకాంబరి దేవి రూపంలో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రత్యేక హోమాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ANN TOP 10