AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేను వ్యాపారవేత్తను చేస్తే.. నా కూతురు ప్రధాన మంత్రిని చేసింది!


బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన కుటుంబం గురించి సునక్ అత్తగారు, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్తను తాను వ్యాపారవేత్తను చేశానని, తన కూతురు అక్షత మూర్తి మాత్రం తన భర్తను బ్రిటన్ దేశానికి ప్రధానిని చేసిందని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి వ్యాఖ్యానించారు.

నారాయణ మూర్తి , సుధా మూర్తి దంపతుల కూతురు అక్షత మూర్తి భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అన్న విషయం తెలిసిందే. రిషి సునక్ , అక్షత మూర్తి 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రిషి సునక్ జీవితాన్ని తన కూతురు అక్షత మూర్తి ఎన్నో విధాలుగా ప్రభావితం చేసిందని సుధామూర్తి వెల్లడించారు. ముఖ్యంగా రిషి ఆహార అలవాట్లను మార్చడం, మత విశ్వాసాలన పెంపొందించడం వంటివి చేసిందని తెలిపారు.

రిషి సునక్ అత్యంత చిన్న వయస్సులోనే బ్రిటన్ వంటి దేశానికి ప్రధాని అయ్యారని, రిషి సునక్ ఎదుగుదల వెనుక తన కూతురు అక్షత మూర్తి ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందని సుధామూర్తి వెల్లడించారు. ‘నేను నా భర్తను బిజినెస్ మ్యాన్ ను చేశాను. నా కూతురు తన భర్తను దేశానికి ప్రధానిని చేసింది. చిన్న వయస్సులోనే రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కాగలిగారంటే అందుకు నా కూతురు అక్షత మూర్తే కారణం.’ అని సుధా మూర్తి గర్వంగా తెలిపారు.

రిషి సునక్ పూర్వీకులు సుమారు 150 ఏళ్ల క్రితమే బ్రిటన్ కు వలస వెళ్లారని సుధా మూర్తి వెల్లడించారు. అయినా, వారి కుటుంబం ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా జీవిస్తుంటారని, మత విశ్వాసాలను పాటిస్తూ ఉంటారని సుధామూర్తి తెలిపారు. గురువారం తమకు ఎంతో పవిత్రమైన రోజు అని వెల్లడించారు. అన్ని ముఖ్యమైన పనులను గురువారమే తాము ప్రారంభిస్తామన్నారు. తమ కుటుంబమంతా రాఘవేంద్ర స్వామి భక్తులమని తెలిపారు. ఇన్ఫోసిన్ ను కూడా గురువారమే ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు. తన అల్లుడు రిషి సునక్ ప్రతీ గురువారం ఉపవాసం ఉంటాడని వెల్లడించారు.

ANN TOP 10