మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ దళిత ద్రోహులని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. అధికారంలో ఉండగా దళితులను పట్టించుకోకుండా అవమానించిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాళెంలో తిరిగే అర్హత లేదన్నారు. టీడీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటూ కూడా దళిత నాయకులు అందులోనే ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు.









