నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని కేంద్రమంత్రి అమిత్ షా సన్మానించారు. చిత్ర బృందానికి ఆదివారం ఆయన తేనేటి విందు ఇవ్వనున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులతో 40 నిమిషాల పాటు అమిత్ షా గడపనున్నారు. అనంతరం గంటపాటు తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో షా పాల్గొంటారు.









