చంద్రబాబు చాలా ఫ్రస్టేషన్లో ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తండ్రీకొడుకులు తిరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతి ఇంటి ముద్దు బిడ్డ అని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పెత్తందార్లకు కొమ్ము కాసే వ్యాధి చంద్రబాబుకు పట్టిందన్నారు. అందుకే అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నాడని చంద్రబాబుపై కన్నబాబు మండిపడ్డారు.









