వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తొలుత అవినాష్కు ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్టే ఇస్తే అవినాష్ను సీబీఐ అరెస్టు చేస్తుందని ఆయన తరఫు లాయర్లు వాదించారు. దీంతో సోమవారం వరకు అవినాష్ను అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సోమవారం అన్ని విషయాలను పరిశీలిస్తామని విచారణను వాయిదా వేసింది.









