హైదరాబాద్లో రూట్లు కూడా ఎంపిక చేశారు
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాట ప్రాంతాలు తిరిగివచ్చేలా ప్రత్యేక రూట్లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ బుధవారం ట్వట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే గతంలోనే రూ.12.96 కోట్లతో ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది.అయితే ఎట్టకేలకు ఈ బస్సులు తిరిగేలా కొన్ని రూట్లను ఎంపిక చేశారు. ముఖ్యంగా ట్యాంక్బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ జిల్లా ప్రాంతాల్లో నడపనున్నారు.
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాట ప్రాంతాలు తిరిగివచ్చేలా ప్రత్యేక రూట్లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ బుధవారం ట్వట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే గతంలోనే రూ.12.96 కోట్లతో ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది.అయితే ఎట్టకేలకు ఈ బస్సులు తిరిగేలా కొన్ని రూట్లను ఎంపిక చేశారు. ముఖ్యంగా ట్యాంక్బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ జిల్లా ప్రాంతాల్లో నడపనున్నారు.









