టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే బాక్సాఫీస్ దగ్గర అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం ఆయన తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్తో బిజీగా ఉండటానికి సిద్ధమవుతుండగా, అప్పుడే ఆయన తర్వాత సినిమా గురించిన ఒక సెన్సేషనల్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్లో తెగ హల్చల్ చేస్తోంది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో మహేష్ బాబు జతకట్టబోతున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ ఈ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేయడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు మహేష్ బాబు డేట్స్ను కూడా బ్లాక్ చేశారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ చెప్పిన ఒక పవర్ఫుల్ లైన్ మహేష్ బాబుకు బాగా నచ్చిందని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ భారీ కాంబోపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
బాక్సాఫీస్ దగ్గర ‘మాస్ విధ్వంసం’ ఖాయం!
మహేష్ బాబు క్లాస్ అండ్ స్టైలిష్ లుక్.. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ కలిస్తే స్క్రీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే అభిమానులకు ఒళ్లు గగుర్పొడుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కాంబోపై భారీ ఎత్తున చర్చలు మొదలయ్యాయి. “మహేష్ బాబు అల్టిమేట్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ‘మాస్ విధ్వంసం’ ఖాయం” అంటూ నెటిజన్లు, అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు తన పూర్తి ఫోకస్ను “వారణాసి” సినిమాపైనే పెట్టనున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా తన కమిట్మెంట్స్ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు ముగిసిన తర్వాతే ఈ డ్రీమ్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఏదేమైనా, ఈ వార్త మాత్రం టాలీవుడ్లో సరికొత్త ఊపును తీసుకొచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!








