పెట్రోల్, డిజిల్ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. దీంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి కొత్త ధరలు అమలు లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలను కేంద్రం పెంచింది. ఉదయం 6గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఈనెలలో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు లను కేంద్రం పెంచింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.112.84, డీజిల్ రూ.100.94 గా అమలు చేశారు. ఇంధన ధరల పెంపుతో వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు.
నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం..
దేశంలో డీజిల్ పట్రోల్ ధరలు పెరగడం వల్ల రవాణా రంగాలపై తీవక్ర ప్రభావం పడే అంవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరిగితే దీని ప్రభావం నేరుగా కూరగాయలు, పాలు, నిత్యావసం వస్థులవులపై తీంవ్ర ప్రభాంవం చూపుతుంది. ఇప్పటికే కేంద్రం మూడవ సారీ ఇంధన ధరలు పెంచడంతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందుల ఎదురవుతున్నాయి. కార్మికులు, ఆటో డ్రైవర్లు, లారీ యజమానులు, క్యబ్ డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు నాయకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








