AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో పెట్రోల్ పంపుల మూసివేత..! సీఎం చంద్రబాబు సమీక్ష..

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీని ప్రభావం హోర్మూజ్ జలసంధిపై పడనుంది. దీంతో రానున్న రోజుల్లో చమురు కష్టాలు తప్పవని ప్రజలు భావిస్తున్నారు. పరిస్థితి గమనించిన వినియోగదారులు పెట్రోల్, డీజిల్ భారీగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు మూతబడుతున్నాయి. ఈ విషయం ప్రభుత్వం చెవిలో పడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.

 

ఏపీలో పెట్రోల్ పంపుల మూసివేత

 

ఇరాన్-అమెరికా మధ్య చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చమురు కష్టాలు రావచ్చని వినియోగదారులు భావిస్తున్నారు. ఆయిల్ లేకుంటే తమకు పనులు జరగవని చాలామంది వినియోగదారులు భావిస్తున్నారు. ప్రజలు ఆందోళనకు గురిరావడంతో పెట్రోల్ బంకుల్లో రద్దీ తీవ్రమైంది.

 

క్కసారిగా డిమాండ్ 50 శాతానికి పెరిగింది. పెట్రోల్, డీజిల్ సరైన సమయానికి రాకపోవడంతో మూతబడుతున్నాయి. శ్రీకాకుళం మొదలు చిత్తూరు జిల్లా వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ఆయా బంకుల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంది. దీనిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి సంబంధించి ఆదివారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

 

ప్యానిక్‌తో పెరిగిన కొనుగోళ్లు, సీఎం చంద్రబాబు సమీక్ష

 

ఏపీ వ్యాప్తంగా 4,510పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందులో 10 శాతం బంకులు సరఫరా లేక మూతపడ్డాయి. ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. సరఫరా గతం కంటే 10 శాతం పెరిగింది.

 

ప్యానిక్ వల్ల కొనుగోళ్లు చేయడంతో అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని వివరించారు. సాధారణ రోజుల్లో 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9048 లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. కొరత రాబోతుందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని తెలిపారు. శనివారం 10,345 లీటర్ల పెట్రోల్, 14,156 లీటర్ల డీజిల్ అమ్మకం జరిగినట్లు వివరించారు.

 

సాధారణ అమ్మకాల కంటే ఒక్కసారిగా 50 శాతం అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని తెలియజేశారు. వినియోగదారులు అనేక పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆక్వా రంగంలో డ్రమ్‌లలో ఆయిల్ కొనుగోళ్లు జరుపుతారని, వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందన్నారు.

 

దీనికి పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు-ఫిషరీష్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలన్నారు సీఎం. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

ANN TOP 10