AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కూల్ డ్రింక్స్ కంటే బీరే హెల్తీ.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!

ఏపీ రాజకీయాల్లొ ఓ వార్త సోషల్ మీడియాలో యమ చక్కర్లు కొడుతుది. అసలు ఏంటా వార్త? ఆంద్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. మనం రోజు తాగే సాఫ్ట్ డ్రింక్స్ కంటే బీర్ తాగడమే ఆరోగ్యానికి మంచిదంటూ.. అధికార పార్టీలొ ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పై రాష్ట వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది.

 

అవి చెడ్డవి కావు..

కూల్ డ్రిక్స్ కంటే బీరే మంచిదని టీడీపీ రాష్ట అద్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మరాయి. రాష్ట్రంలో బీచ్ వద్ద ఉన్నటువంటి మద్యం షాపులు చెడ్డవని చెప్పడానికి ఎమి లేదని ఆయన అన్నారు. ఆదివారం ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీరుతో పోలిస్తే.. కూల్ డ్రింక్‌లోనే అధికమైన చక్కెర ఉంటుందని ఆయన అన్నారు. చాలా తక్కువ కాలరీలు బీరులో ఉంటాయని ఆయన అన్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. నేను దీని గురించి మాట్లాడితే బీరు తాగడాన్ని ప్రోత్సహిస్తున్నానని అంటారు కానీ.. ఇదే నిజమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్లో ఈ సదుపాయాలను ఎర్పాటు చేస్తే విశాఖ మరింత అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు. బీచ్‌లలో బీచ్ షేక్స్ పేరుతో మద్యం షాపులు ఎర్పాటు చేయడం మంచిదేనని ఆయన అన్నారు. దీంతో మన సంసృతిని కాపాడుకుంటూ.. మోడరన్ టూరిజాన్ని అభివృద్ది చేస్తామని పల్లా శ్రీనివాస రావు అన్నారు.

మీ పిల్లలు జాగ్రత్త అంటూ..

అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇలా మాట్లాడటం ఏంటని రాష్ట్రంలోని కొంత మంది ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రజలకు మంచి చేసి, ప్రజా అవసారాలు తీర్చే నాయకులే ఇలా మాట్లాడితే ఎలా అని ఫైర్ అయ్యారు. పల్లా శ్రీనివాస రావు ఎమ్మెల్యే పదవితో పాటుగా గీతమ్స్, విజ్ఞాన్, భాష్యం, నారాయణ కాలేజీల్లో ఇప్పుడు పిల్లలకు కూల్ డ్రింక్స్ బదులు బీర్లు పెడతారేమో అంటూ కొంత మంది వ్యక్తులు వ్యంగంగా మాట్లాడారు. దీంతో ఈ కాలేజీల్లో మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకొండి అంటూ కొంత మంది వ్యక్తులు సెటేర్లు వేసారు. అధికార పార్టీలో ఉంటూ ఇలా మాట్లాడటం దారుణం అని అన్నారు.

ANN TOP 10