AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇండోనేషియా: జకార్తాలో ఏడు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం – గర్భిణితో సహా 20 మంది మృతి!

ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఒక కార్యాలయ భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు గర్భిణితో సహా 20 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పురుషులు మరియు 15 మంది మహిళలు ఉన్నారు. ఈ అగ్నిప్రమాదం ఏడు అంతస్తుల భవనం మొత్తం వ్యాపించింది, గాలిలోకి దట్టమైన నల్ల పొగ ఎగిసిపడటంతో సెంట్రల్ జకార్తాలోని ప్రజలు భయాందోళనలు చెందారు.

ప్రమాదం జరిగిన భవనం డ్రోన్ సేవలు అందించే ఒక కార్యాలయం (టెరా డ్రోన్ ఇండోనేషియా) అని తెలిసింది, ఇది మైనింగ్ నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో వైమానిక సర్వే కార్యకలాపాల కోసం క్లయింట్లకు సేవలు అందిస్తుంది. మంటలను ఆర్పేసినప్పటికీ, భవనంలో చిక్కుకున్నవారిని బయటకు తీయడానికి సహాయక బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

అగ్నిప్రమాదానికి కారణంపై అధికారులు ప్రాథమికంగా స్పందించారు. మొదటి అంతస్తులో ఒక బ్యాటరీకి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం మొదలైందని తెలిపారు. ఆ మొదటి అంతస్తును గోదాములా వాడుతుండటం వలన మంటలు త్వరగా వ్యాపించి, తీవ్ర ప్రాణనష్టానికి కారణమైందని అధికారులు వ్యాఖ్యానించారు.

ANN TOP 10