AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“సంబంధం లేని విషయాల్లో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం”: జగన్‌పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ తీరు “పాపాలు చేసేవాళ్లు నీతులు చెప్పినట్లుగా” ఉందని, రాష్ట్రంలో జరిగిన అనేక వ్యవహారాలకు బాధ్యత వహించకుండా, సంబంధం లేని విషయాల్లో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, గతంలో అదే ప్రాజెక్టును ‘గోడౌన్’ అని తన పత్రికలో రాయించి, ఇప్పుడు తానే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు, బుద్ధి లేని చర్య అని సోమిరెడ్డి విమర్శించారు.

నకిలీ మద్యం వ్యవహారంపై కూడా సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యం దందాలో జగన్ పాత్ర ఉందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే బుకాయిస్తున్నారని అన్నారు. “జగన్-జోగి రమేశ్-జనార్దన్ రావు కాంబినేషన్‌లో నకిలీ మద్యాన్ని తయారు చేయించి, ప్రజాధనాన్ని మింగింది” అని సోమిరెడ్డి ప్రశ్నించారు. మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, ఈ నిజాన్ని ప్రజల నుంచి పక్కదారి పట్టించేందుకే జగన్ దానిని ‘డైవర్షన్’ అంటున్నారని ఆయన మండిపడ్డారు.

అభివృద్ధి విషయంలో జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సోమిరెడ్డి విమర్శించారు. “భోగాల కోసం రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్న పెద్ద మనిషి, ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ తీరును గమనిస్తుంటే, “ఇన్నాళ్లూ జగన్‌ను సగం పిచ్చోడనుకున్నాం, కానీ ఇప్పుడు పూర్తి పిచ్చోడని స్పష్టంగా అర్థమైంది” అంటూ సోమిరెడ్డి తన విమర్శనాస్త్రాన్ని ముగించారు.

ANN TOP 10