AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్ నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..!

భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

 

రాధాకృష్ణన్ పదవీకాలం విజయవంతంగా, సంతృప్తికరంగా, విశిష్టంగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశ ప్రగతి, శ్రేయస్సును ముందుకు తీసుకెళుతూ, మన గొప్ప దేశానికి సేవ చేసేందుకు ఆయన పదవీకాలం అంకితమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

“సీపీ రాధాకృష్ణన్ గారికి ఉన్న అపారమైన జ్ఞానం, సుసంపన్నమైన అనుభవం మన ప్రజాస్వామ్య విలువలను మరింత ఉన్నతంగా నిలబెడతాయని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను” అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన నాయకత్వ పటిమ దేశానికి ఎంతో మేలు చేస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

ANN TOP 10