AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ రెడ్డి నాకు మిత్రుడే.. కానీ పదేళ్ల కిందటి నుంచి చెడింది

అసెంబ్లీలో కేటీఆర్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
సీఎం రేవంత్‌ రెడ్డి నాకు మిత్రుడేనని, పదేళ్ల కిందటి నుంచే మా మధ్య చెడిందని కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ హాట్‌ హాట్‌గా నడుస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టుతో బాగుపడేదెవరు? వచ్చే లాభం ఎంత ? అని ప్రశ్నించారు. పాలసీలు కాదు..కేసీఆర్‌ అంటేనే జెలసీ మాత్రమే కనిపిస్తోందని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పగా చేయాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్‌ అన్నారు. న్యూయార్క్‌ కంటే గొప్పగా చేస్తామంటున్నారు..చాలా సంతోషమన్నారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు మేం కూడా చెల్లించామని గుర్తు చేశారు. నేను విదేశాల్లో చదివానని, రేవంత్‌ అదృష్టం కొద్దీ సీఎం అయ్యారని కేటీఆర్‌ వెల్లడించారు. ఆదానీని రాహుల్‌ గాంధీ వ్యతిరేకిస్తే.. రేవంత్‌ వెల్కమ్‌ చెబుతున్నారని, అయితే పెట్టుబడుల విషయంలో సీఎం జాగ్రత్తగా వ్యవహరించాలని కేటీఆర్‌ సూచించారు. బస్సు ప్రయాణం మంచిదే కానీ.. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై శ్రీధర్‌బాబు అభ్యంతరం..
కేటీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో పత్రికల స్టేట్‌ మెంట్స్‌ తీసుకురావడం సరికాదన్నారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేస్తుందని మంత్రి పొన్నం అన్నారు. మహిళలను అవమానించడం సరికాదని, అవహేళన వీడియోలు సృష్టించిన వారిని ఉపేక్షించమని మంత్రి అన్నారు.

ANN TOP 10