హైదరాబాద్ మోష్ పబ్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్స్తో వ్యాపారులకు, విద్యార్దులకు వల వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ అక్రమ దందా గత కొంతకాలంగా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారులను, విద్యార్దులను పబ్కి వచ్చేలా చేసి ఖరీదైన మద్యం తాగించి లక్షల రూపాయల టోకరా పెట్టారు. పబ్ ప్రతినిధులతో పాటు 8 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.









