AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తొలి రెండు గంటల్లో 11.31 శాతం పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనున్న ఈ ఓటింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్‌ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 11.31 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటల వరకూ 11.31 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో 14.35 శాతం కాగా, ఒడిశాలో అత్యల్పంగా 7.69 శాతం ఓటింగ్‌ నమోదైంది. బీహార్‌లో 10.58 శాతం, చండీగఢ్‌లో 11.64 శాతం, జార్ఖండ్‌లో 12.15 శాతం, పంజాబ్‌లో 9.64 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 12.94 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 12.63 శాతం మేర పోలింగ్‌ నమోదైంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10