AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ రెస్టారెంట్లకు రేటింగ్ పరీక్ష.. తేడా వస్తే ..

హైదరాబాద్‌లోని రెస్టారెంట్లకు హైజీన్ రేటింగ్స్ ఇవ్వాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) నిర్ణయించింది. నగరంలోని పలు రెస్టారెంట్లపై ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి ఆహారంలోని నాణ్యతను, వంట శాలల్లోని శుభ్రతపై క్షుణ్ణంగా పరిశీలించారు. శుభ్రత, నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దం అయ్యారు. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్లకు కస్టమర్లపట్ల జవాబుదారీతనాన్ని పెంచడం కోసం నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని ఆదేశాలు జారీచేయనుంది.

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) హైదరాబాద్ చాప్టర్ హెడ్ సంపత్ తుమ్మల అధ్యక్షతన 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రమాణాలు నగరం అంతటా అమలయ్యేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రెస్టారెంట్లలో పరిశుభ్రత ప్రమాణాలను పెంచడానికి, ఈ 15 మంది సభ్యులతో కూడిన బృందం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) సహకారం కోరింది.

తెలంగాణ ఆహార భద్రతా విభాగం టాస్క్‌ఫోర్స్ తనిఖీల సమయంలో కూడా వివిధ రెస్టారెంట్లలో కేవలం పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం అందించడంలో సమస్యలను గుర్తించిన తర్వాత ఈ కార్యక్రమాలు చేపట్టారు అధికారులు. వీటిని నగరంలోని అన్ని రెస్టారెంట్లలో అమలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. ఈ వర్క షాపులు, శిక్షణా కార్యక్రమాలు పూర్తైన తరువాత కూడా పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత లేకపోతే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కమిటీ సభ్యులు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10