ఐదో దశ ఓటింగ్కు ముందు లక్నోలోని ఇండియా అలయన్స్ మోడీ ప్రభుత్వం కూలిపోబోతోందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే పేదలకు 5 కిలోలకు బదులుగా 10 కిలోల ఉచిత రేషన్ ఇస్తామని ప్రకటించారు. బుధవారం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో కలిసి లక్నోలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. నాలుగో విడత ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మరింత బలోపేతంగా ఉందని, దేశ ప్రజలు మోడీకి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైననవి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇదో మంచి అవకాశం అన్నారు. ఒకవైపు పేదలను ఆదుకునే పార్టీలు ఉన్నాయని, మరోవైపు ధనికులను ఆదుకునే పార్టీలు ఉన్నాయని అన్నారు. ఇండియా కూటమి పేదల కోసం ఎన్నికల్లో పోరాడుతోందన్నారు. మనమందరం కలిసి దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకుంటే మళ్లీ బానిసలుగా మారతామని చెప్పారు.
*ఇండియా కూటమిదే హవా: అఖిలేష్ యాదవ్*
ప్రజాస్వామ్యం కాకుండా నిరంకుశత్వం, నియంతృత్వం వస్తుందని, మోడీని గద్దె దింపేందుకు పేదల తరఫున తాము పోరాడుతున్నామని అన్నారు. అందుకే ప్రజల మద్దతు తమకే ఉందన్నారు. 26 పార్టీలు ఏకమై పని చేయడం తన రాజకీయ జీవితంలో చూడలేదని, ఇన్ని పార్టీలు కలిసి పని చేస్తున్నాయంటే మోడీపై దేశంలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతోందని కామెంట్స్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కాపాడటం మనదే బాధ్యత అన్నారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్ కేంద్రంలో మహిళ ఓటర్ బుర్కా తొలగించిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం అవుతుందా? మా ఎన్నికల ఏజెంట్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. 2/3 మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని మరో బీజేపీ నేత చెబుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించేందుకు మోడీ ఎందుకు భయపడుతున్నారని ఖర్గే ప్రశ్నించారు. కులగణన చేస్తామని తాము చెబుతుంటే సంపదను లాక్కుని వాటిని ముస్లింలకు పంచిపెడతారు మోడీ అబద్దాలు చెబుతున్నారని కామెంట్స్ చేశారు. ఇంత అబ్దదాల కోరును తాను ఎన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి బలంగా ఉందని, తాము ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు యూపీలో 79 సీట్లు తాము సాధిస్తామని, దేశంలో ఇండియా కూటమి హవా నడుస్తోందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు.