తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్తారు. శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేస్తారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులు ర్యాలీకి సంబంధించి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల వారిగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ ముందుకు వెళ్తున్నారు.









