అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి కలిశారు. సచివాలయంలోని చాంబర్లో మంత్రిని కంది మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికలపై వీరిద్దరు సుదీర్ఘంగా చర్చించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించినట్లు సమాచారం.
