AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

15 నుంచి ఒంటిపూట బడులు.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

ఎండలు దంచికొడుతున్న వేళ..
తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. 15 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపించనున్నారు. ఇక టెన్త్‌ ఎగ్జామ్స్‌కు కేటాయించిన పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ANN TOP 10